ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 2, 2020, 3:38 PM IST

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో గాంధీ జయంతి వేడుకలు

మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమాన్ని జగ్గయ్యపేట, అమరావతి తెదేపా కేంద్ర కార్యలయం ఎన్టీఆర్​ భవన్​లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. దేశానికి ఇద్దరు నేతలు చేసిన సేవలను మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ,పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు స్మరించుకున్నారు.

Gandhi Jayanti celebrations in Krishna district
కృష్ణా జిల్లాలో గాంధీ జయంతి వేడుకలు

మహాత్మాగాంధీ జయంతి కార్యక్రమాన్ని జగ్గయ్యపేటలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య వేర్వేరుగా నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. పలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు జాతీయ జెండాను ఎగరవేసి గాంధీ మహాత్మునికి ఘనంగా నివాళులర్పించారు.

అమరావతి తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు నిర్వహించారు. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ అశోక్ బాబు ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశానికి ఇద్దరు నేతలు చేసిన సేవలను వారు స్మరించుకున్నారు. .

ఇదీ చదవండి:

గాంధీజీ ఆశయాలు సీఎం జగన్​తోనే సాధ్యం: సజ్జల

ABOUT THE AUTHOR

...view details