వరుసగా 13వ రోజు పెట్రోల్ ధరల పెంపును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. 13 రోజులుగా నిత్యం రేట్లు పెంచి... పెట్రోలు ధర రూ.80 రూపాయలు దాటించారని ఆరోపించారు. వీటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సుంకాలు 60 శాతం పైనే ఉన్నాయని.. కరోనా కష్టకాలంలో సుంకాలు తగ్గించకపోగా ఇంకా భారం మోపుతారా అని మండిపడ్డారు. ధరల పెంపు కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వాలిచ్చే కరోనా కానుకేమో అని ట్వీట్ చేశారు.
ధరల పెంపు.. కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వాలిచ్చే కానుక: సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి - మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వార్తలు
పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 13 రోజులుగా నిత్యం పెట్రోలు ధరలు పెంచి సామాన్యులపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ధరల పెంపు కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వాలిచ్చే కానుకన్న మాజీ మంత్రి సోమిరెడ్డి
TAGGED:
petrol hike latest news