ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్ ప్రభుత్వం విద్యావ్యవస్థను భ్రష్టుపట్టిస్తోంది: జవహర్

జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటోందని మాజీ మంత్రి జవహర్ ధ్వజమెత్తారు. నాడు నేడు పేరుతో ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం, విద్యార్థులనూ బలిచేసే చర్యలను మానుకోవాలని హితవుపలికారు.

By

Published : Jun 17, 2021, 4:14 PM IST

మాజీ మంత్రి జవహర్
మాజీ మంత్రి జవహర్

సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థను జగన్ ప్రభుత్వం భ్రష్టుపట్టిస్తోందని మాజీమంత్రి జవహర్ ధ్వజమెత్తారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యార్థులకు విద్యను దూరం చేసే నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటోందని మండిపడ్డారు. లోకేశ్​పై పంతంతోనే పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయకుండా కరోనా సమయంలో నిర్వహిస్తున్నారని ఆరోపించారు. నాడు - నేడు పేరుతో ఉపాధ్యాయులను బలితీసుకున్న ప్రభుత్వం, విద్యార్థులనూ బలిచేసే చర్యలను మానుకోవాలని హితవుపలికారు. ఫ్యాప్టోకు విద్యాశాఖ సంచాలకులు నోటీసులివ్వడాన్ని ఖండించారు. ప్రశ్నించే గొంతులను నొక్కేసే క్రమంలో భాగంగానే ఈ నోటీసులిచ్చారని జవహర్‌ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details