ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొండపల్లిలో అక్రమ తవ్వకాలను నిలిపివేశాం: అటవీ శాఖ - కొండపల్లి అటవీ ప్రాంతంలో మట్టి తవ్వకాలు

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలను అడ్డుకున్నామని అధికారులు తెలిపారు. ఈ నెల 4వ తేదీ నుంచి తవ్వకాలు నిలిపివేశామని ప్రకటించారు. 2014 నుంచి 2018 మధ్య అటవీ ప్రాంతంలో అక్రమంగా మట్టిని తవ్వారని గుర్తించినట్టు చెప్పారు.

కొండపల్లి అక్రమ తవ్వకాలను నిలిపివేశాం : అటవీ శాఖ
కొండపల్లి అక్రమ తవ్వకాలను నిలిపివేశాం : అటవీ శాఖ

By

Published : Aug 20, 2020, 10:52 PM IST

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమంగా జరుగుతున్న మట్టి తవ్వకాలను ఈనెల 4 వ తేదీ నుంచి నిలిపివేసినట్లు అటవీ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆ ప్రాంతంలో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. తవ్వకాలపై ప్రాథమిక విచారణ, గూగుల్ ఇమేజ్ లను పరిశీలించగా ఆ ప్రాంతంలో 2014 నుండి 2018 వరకు దందా జరిగినట్టు గుర్తించామని చెప్పారు.

ఎంత మట్టి తవ్వకం జరిగిందన్నదీ.. మైనింగ్, ఇతర శాఖల సహకారంతో అంచనా వేస్తున్నామన్నారు. పూర్తి స్థాయి విచారణ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల అటవీప్రాంతంలో మట్టి తవ్వి తీసుకువెళుతున్న వాహనాలను పట్టుకోగా... ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details