కృష్ణాజిల్లా.. అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలంలోని 150 పేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. దివి మార్కెట్ యార్డ్ చెర్మన్ కనవకొల్లు నరసింహారావు చేతుల మీదుగా ఈ సరకులను అందించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఈ సరకులు వచ్చినట్లు అవనిగడ్డ తహసీల్దార్ మస్తాన్ తెలిపారు. లబ్ధిదారులు కృష్ణాజిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ - నిరుపేద కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ
పేదలకు కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నిత్యావసర సరకులను అందించారు. ఈ సరకులను అవనిగడ్డ తహసీల్ధార్ కార్యాలయంలో 150 మంది పేద కుటుంబాలకు అందించారు.
![పేద కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ food distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7431966-749-7431966-1591008562982.jpg)
food distribution