ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లచ్చిగాని లంకలో ఏం జరిగిందంటే!

వరదలొస్తే...లంక గ్రామాల ప్రజలకు ఎప్పుడూ ఇబ్బందులే. ఎప్పుడు, ఎక్కడ వరదలో చిక్కుకుంటారో తెలియని పరిస్థితి. ఈసారి వరదలో కూడా ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కొంతమంది రైతులు నదిలో ప్రయాణిస్తున్న పంట పొలాలకు వెళ్లారు. తిరిగి అలానే రావొచ్చు అనుకున్నారు. కానీ నదిలో వరద ఉద్ధృతి పెరిగింది.. సాయంత్రం ఇంటికి చేరుకోవాల్సిన దారులన్నీ మూసుకుపోయాయి.

By

Published : Aug 20, 2019, 8:05 PM IST

floods-victims-in-krishna-district

లచ్చిగాని లంకలో ఏం జరిగిందంటే!

లచ్చిగానిలంక..కృష్ణానది మధ్యలో ఉన్న ప్రాంతం. అక్కడ సుమారు 1200 ఎకరాలలో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. నిత్యం వందలాది మంది రైతులు పడవ ప్రయాణం చేసి...మరికొంత దూరం నడిచి...ఈ లంకకు చేరుకుంటారు. రోజూ మాదిరిగానే లంకలో పట్టు పురుగులకు మేత వేయడానికి ఉదయం 5 గంటలకు వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణమయ్యేసారికి ఒక్కసారిగా వరద నీరు లంక చుట్టూ చేరింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి.

మోపిదేవి మండలం, కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతులు రోజూలానే పడవపై పంట పొలానికి వెళ్లి...వరదకు లంకలోనే ఉండిపోయారు. గంటగంటకు పెరుగుతున్న నీటిమట్టంతో తాము నదిలో మునిగిపోతామని భయపడిపోయారు. ఎవరైనా రక్షిస్తారేమోనని ఎదురు చూశారు. కేకలు వేశారు. ఎలాగోలా..సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ప్రాణాలకు తెగించి రైతులను కాపాడారు. అప్పుడే వరద రావడం మొదలవడంతో పోలీసులు కాపాడే సమయానికి ఎస్డీఆర్​ఎఫ్, ఎన్డీఆర్​ఎఫ్ బృందాలు అక్కడికి చేరుకోలేదు.

అయితే...కృష్ణానది మధ్యలో ఉన్న ప్రభుత్వ భూమిలో...సొసైటీగా ఏర్పడి తలో ఎకరంలో పసుపు, కంది, అరటి, చెరకు పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ లంకలోనే సుమారు వందల సంఖ్యలో పశువులు కూడా ఉంటాయి. తమను తమ పశుసంపదను కాపాడిన పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: కృష్ణమ్మ పరవళ్లు..నిండుకుండలా జలాశయాలు

ABOUT THE AUTHOR

...view details