ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లక్కీడ్రా పేరిట మోసం.. ఐదుగురు అరెస్ట్ - కృష్ణా జిల్లా వార్తలు

లక్కీ డ్రా పేరిట ప్రజలను మోసం చేస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 18 లక్షల 40 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వీరు 22 స్కీమ్ ల పేరుతో 140 మందిని మోసం చేసినట్లు తెలిపారు.

Five people have been
Five people have been

By

Published : Oct 19, 2020, 10:26 PM IST

లక్కీ డ్రా పేరిట అమాయక ప్రజలకు టోపీ వేస్తున్న ఐదుగురు వ్యక్తులను కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. విస్సన్నపేటలో శ్రీవిజ్ఞేశ్వర లక్కీ డ్రా పేరిట 22 స్కీమ్ లతో 140 మందిని మోసం చేసినట్లు నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.

వీరు తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, బాపులపాడు చాట్రాయి రెడ్డిగూడెం, వేంసూరు, సత్తుపల్లి మండలాల్లో లక్కీడ్రా పేరిట మోసాలకు పాల్పడ్డారని డీఎస్పీ వివరించారు. శిలపురెడ్డి రాంమొహన్‌రెడ్డి, మురళి మెహన్ రెడ్డి, కుక్కడపు లక్ష్మీనారాయణ, పానుగంటి అంజిబాబు, విస్సంపల్లి శ్రీరాములు అనే నిందితులను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వారి నుంచి 18 లక్షల 40 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

రికవరీ చేసిన నగదును బాధితులకు అందజేస్తామని తెలిపారు. బాధితులు ఇంకెవరైనా ఉంటే విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని.. వారికి న్యాయం జరిగేలా చూస్తామని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ప్రజలు సులభ సంపాదన మోజులో పడి ఇలాంటి డ్రాలను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని డీఎస్పీ సూచించారు.

ఇదీ చదవండి:

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

ABOUT THE AUTHOR

...view details