కృష్ణాజిల్లా, కోడూరు మండలం కృష్ణావన్యప్రాణి అభయరణ్య పరిధిలో ఉన్న పాలకాయతిప్ప తీరానికి వందల మంది పర్యటకులు వస్తుంటారు. మడచెట్లు, అరుదైన వన్య ప్రాణులతో ఇక్కడ ఉన్న ప్రకృతి అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సినిమా షూటింగ్లూ జరుగుతున్నాయి. ఈ బీచ్కు 3 కిలోమీటర్ల దూరంలోనే హంసలదీవి ఉంది.
సూచన బోర్డులు లేకే .. చాలామంది మరణిస్తున్నారు
సెలవు రోజుల్లో ఒక్కో రోజుకు సుమారు 2 వేల మంది పర్యటకులు వస్తారు. సాగర సంగమం వద్ద సూచిక బోర్డుల్లేక నదిలో దిగి చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇక్కడ సముద్రం చాలా ఉద్దృతంగా ఉంటుంది. 5 అడుగుల దూరంలో 50 అడుగుల లోతు ఉంటుంది. ఇక్కడ దిగితే బ్రతకడం చాలా కష్టం.
మాకు రక్షణ కల్పించండి..