ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 5, 2019, 2:54 PM IST

ETV Bharat / state

కారులో మంటలు..మహిళ సజీవ దహనం

కర్ణాటక బీదర్​ జిల్లాలో కారులోనే ఓ మహిళ సజీవ దహనమైంది. నాసిక్​ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇద్దరు పిల్లలు భర్త ప్రాణాలతో బయటపడ్డారు.

కారులో  మంటలు..మహిళ సజీవ దహనం
కారులో మంటలు..మహిళ సజీవ దహనం

కారులో మంటలు..మహిళ సజీవ దహనం

కర్ణాటక బీదర్ జిల్లాలో కారులోనే ఓ మహిళ సజీవ దహనమైంది. మచిలీపట్నానికి చెందిన భార్యాభర్తలు వ్యాపార నిమిత్తం నాసిక్​లో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలతో కలిసి స్వగ్రామానికి బయల్దేరారు.

హుమ్నాబాద్ తాలూకా మన్నె కెళ్లి సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారి నిర్ణ కూడలి వద్దకు చేరుకోగానే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఈ ప్రమాదంలో కల్యాణి కారులోనే సజీవ దహనమయ్యారు. ఇద్దరు పిల్లలు, భర్త ప్రాణాలతో బయటపడ్డారు. కల్యాణి ముందు సీట్లో కూర్చోవడం వల్ల మంటలు వ్యాపించి సజీవదహనమైనట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details