విద్యుదాఘాతంతో మూడు ఇళ్లు దగ్ధం - 5 houses fired due to short circuit in krishna district
నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామంలో విద్యుదాఘాతంతో ముడు గృహాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. అయిదు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. దీనిపై అధికారులు నివేదిక పంపారు.

విద్యుదాఘాతంతో మూడు ఇళ్లులు దగ్ధం
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగేగడ్డ గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో మూడు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అందులో నివసిస్తున్న అయిదు కుటుంబాలు వీధిన పడ్డారు. ఈ ప్రమాదంలో రూ. 9.21లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని గ్రామ రెవెన్యూ అధికారి పెండ్యాల చంద్ర మోహన్... తహశీల్దారుకు నివేదిక పంపారు. ఈ ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినట్లు గ్రామస్థులు అధికారులకు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో మూడు ఇళ్లులు దగ్ధం
Last Updated : Dec 9, 2019, 7:43 AM IST