ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బస్సులో చెలరేగిన మంటలు..డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం - గరికపాడు చెక్​పోస్ట్​ సమీపంలో ఏపీఎస్​ ఆర్టీసీ బస్సులో అగ్ని ప్రమాదం

ఏపీఎస్​ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​పోస్టు వద్ద బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్.. అందుబాటులోని అగ్నిమాపక పరికరంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు.

fire accident
మంటలు చెలరేగిన బస్సు

By

Published : Nov 21, 2020, 6:00 PM IST

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న.. గరుడ ఏసీ బస్సులో అకస్మాతుగా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్​పోస్టు సమీపంలో.. ఏపీఎస్​ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది.

అప్రమత్తమైన డ్రైవర్.. బస్సులో ప్రయాణికులను వెంటనే కిందికి దింపాడు. వాహనంలోని అగ్నిమాపక పరికరంతో.. పొగ, మంటలను అదుపులోకి తీసుకువచ్చాడు. అనంతరం ప్రయాణికులను మరో బస్సులో అక్కడినుంచి పంపించాడు.

ఇదీ చదవండి:రెండు లారీలు-కారు ఢీ.. క్యాబిన్​లో ఇరుక్కున్న లారీ డ్రైవర్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details