ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 6, 2021, 1:26 AM IST

Updated : Mar 6, 2021, 10:55 AM IST

ETV Bharat / state

అగ్నిప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధం.. 12 గొర్రెలు సజీవదహనం

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కుమ్మమూరులో అగ్ని ప్రమాదం జరిగింది. మద్దులవానిగూడెం రోడ్లు కాలువ కట్టపై పది పూరిళ్ళు, 12 గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించిందని తెలిపారు.

fire accident at kummamuru
కుమ్మమూరులో అగ్నిప్రమాదం

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం కుమ్మమూరులో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో 10 పూరిళ్లు దగ్ధం కాగా.. 12 గొర్రెలు సజీవదహనమయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

కుమ్మమూరులో అగ్నిప్రమాదం
Last Updated : Mar 6, 2021, 10:55 AM IST

ABOUT THE AUTHOR

...view details