ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 27, 2020, 8:00 PM IST

ETV Bharat / state

'రాష్ట్రంలోని చెరువులన్నింటినీ నీటితో నింపండి'

రాష్ట్రంలోని చెరువులన్నింటిని నీటితో నింపాలని సంబంధిత అధికారులను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశించారు. చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు పూడిక తీయించాలని సూచించారు.

minister anil kumar
minister anil kumar

రాష్ట్రవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున చెరువులను నింపేందుకు కార్యాచరణ చేపట్టాలని జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 37 వేల పైచిలుకు చెరువులున్నాయని... గోదావరి, కృష్ణా నదుల నుంచి వేర్వేరు ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని వీటిని పూర్తి సామర్థ్యంతో నింపాల్సిందిగా మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువుల్లో 80.25 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందన్న మంత్రి... నిల్వ సామర్థ్యం పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

జూన్ నుంచి ఇప్పటి వరకూ శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగతా చోట్ల సంతృప్తికర స్థాయిలోనే వర్షాలు కురిశాయని చెప్పారు. మొత్తం 2679 టీఎంసీల నీరు ఉంటుందని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. రిజర్వాయర్లు 77 శాతం మేర నిండాయని ఇంకా పూర్తిస్థాయిలో వీటిని నింపాల్సి ఉందని మంత్రి తెలిపారు. చెరువుల నీటి నిల్వ సామర్థ్యం పెంచేందుకు పూడిక తీయించాలని సూచించారు. అటు ఇతర నీటి సంరక్షణా కట్టడాల వల్ల మరో 21 టీఎంసీ నీరు నిల్వ చేయగలిగామని మంత్రి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details