ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు

వెన్న శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలతో నూతనంగా తయారు చేసిన 10 కిలోల పెరుగు బకెట్​ను కృష్ణా మిల్క్ యూనియన్ యాజమాన్యం మార్కెట్​లో విడుదల చేసింది.

By

Published : Feb 1, 2020, 10:18 PM IST

విపణిలోకి  వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు
విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు

విపణిలోకి వెన్నశాతం తక్కువగా ఉండే పెరుగు

విజయవాడలో కృష్ణా మిల్క్ యూనియన్ యాజమాన్యం... వెన్న శాతం తక్కువగా ఉండే టోన్డ్ పాలతో నూతనంగా తయారు చేసిన 10 కిలోల పెరుగు బకెట్​ను మార్కెట్​లోకి ప్రవేశపెట్టారు. యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు పెరుగు బకెట్​ను విపణిలోకి విడుదల చేశారు. సామాన్య, మధ్యతరగతి వారికి కూడా విజయ పాల ఉత్పత్తులు అందించాలనే ఉద్దేశంతోనే ఈ పెరుగు బకెట్​ను అందుబాటులోకి తీసుకొచ్చిన్నట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలో మరికొన్ని ఉత్పత్తులు ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు కార్యచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పాడిరైతులు, వినియోగదారులు తమ సంస్థకు రెండు కళ్లలాంటి వారని అభివర్ణించారు.

ABOUT THE AUTHOR

...view details