ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిగుబడి తగ్గుతుందని.. తాటి చెట్లను నరికేస్తున్న రైతులు - latest news of thatimunjulu in krishna dst

ఈ పకృతిలో ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా పకృతి సహజంగా చౌకగా లబించే తాటి ముంజలు అంటే చిన్న పిల్లలు దగ్గర నుంచి ముసలి వారు వరకు ఇష్టపడతారు. ముఖ్యంగా వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడం కోసం అనేక పోషక విలువలు ఉన్న తాటి ముంజలను ఎవరూ వద్దనరు. ఇలాంటి వాటిపైనా కరోనా ప్రభావం పడింది.

farmers in krishna dst divisima cutting trees due to geting loss to that trees shadow
farmers in krishna dst divisima cutting trees due to geting loss to that trees shadow

By

Published : May 5, 2020, 4:52 PM IST

కృష్ణా జిల్లా దివిసీమ నుంచి ప్రతి రోజు వేల సంఖ్యలో ముంజు కాయలు హైదరాబాద్ కు ఎగుమతి జరిగేవి. ఈ తాటి ముంజల ఆదాయంతో వందలాది మంది జీవనోపాధి పొందేవారు. కోవిడ్ 19 వైరస్ వ్యాప్తి ప్రభావంతో రవాణాకు ఆటంకం కలగి.. తాటి కాయలు చెట్ల పైనే కాయలు ముదిరి పోతున్నాయి.

మరోవైపు.. దివిసీమలో కొద్దిమంది రైతులు పొలం గట్లపై ఉన్న తాటి చెట్ల కారణంగా.. నీడ వచ్చి పంట దిగుబడి తగ్గుతుందని వాటిని రైతులు నరికివేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పొలం గట్లు పై ఉన్న వాటిని నరకకుండా ఆయా మండల రెవిన్యూ అధికారులు ఒల్టా చట్టాన్ని పటిష్టంగా అమలు పరచాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details