కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉరివేసుకొని కౌలురైతు ఆత్మహత్య - తోట్లవల్లూరు నేర వార్తలు
అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది.
![ఉరివేసుకొని కౌలురైతు ఆత్మహత్య farmer suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10389007-935-10389007-1611661762942.jpg)
గరికపర్రుకు చెందిన ఉయ్యురు కృష్ణ (55) మూడు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. పంట పెట్టుబడికి అప్పులు తీసుకొచ్చాడు. సరైన దిగబడి రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. ఈ నేపధ్యంలో చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం నుంచి అతను కనబడటం లేదంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని దేహాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు తోట్లవల్లూరు పోలీసులకు తెలియజేయగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్ వికటించి ఇద్దరికి అస్వస్థత