కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో పాము కాటుకు గురై.. తుమ్మా వెంకట నరసింహారావు అనే రైతు మరణించాడు. నిన్న పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసిన విషయం గమనించలేదు. సేద్యం పనులు పూర్తి చేసి ఇంటికి వచ్చి పడుకోగా.. రాత్రి 8 గంటల సమయంలో నురగలు కక్కుతూ పడిపోయాడు. దగ్గరలోని ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
పొలం పనులు చేస్తుండగా పాముకాటు.. రైతు మృతి - కొత్తమాజేరులో పొలం పనులు చేస్తున్న రైతును కాటేసిన పాము
పాము కాటుకు గురైన విషయాన్ని గమనించకపోవడం వల్ల ఓ రైతు మృతి చెందాడు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్తమాజేరులో.. తుమ్మా వెంకట నరసింహారావు పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. ఇంటికి వచ్చిన అనంతరం అతడు నురగలు కక్కతూ మరణించాడు.
![పొలం పనులు చేస్తుండగా పాముకాటు.. రైతు మృతి farmer died with snake bite](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9846042-410-9846042-1607696009640.jpg)
పాముకాటుతో మృతి చెందిన రైతు