ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాగులో నష్టం తట్టుకోలేక యువకుడు బలవన్మరణం

డిగ్రీలో ఫెయిలైన యువకుడు వ్యవసాయం చేసుకుని జీవితం సాగించాలనుకున్నాడు. కానీ సాగులో నష్టం వచ్చిందని పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా గుడికల్​లో జరిగింది.

By

Published : Feb 24, 2020, 9:49 PM IST

FARMER DEATH IN KARNOOL DISTRICT
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

సాగులో నష్టం తట్టుకోలేక యువకుడు బలవన్మరణం

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్​లో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు బోయ రాముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డిగ్రీలో ఫెయిలైన రాముడు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే పంట సాగులో నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details