కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గుడికల్లో ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు బోయ రాముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. డిగ్రీలో ఫెయిలైన రాముడు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే పంట సాగులో నష్టాలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
సాగులో నష్టం తట్టుకోలేక యువకుడు బలవన్మరణం
డిగ్రీలో ఫెయిలైన యువకుడు వ్యవసాయం చేసుకుని జీవితం సాగించాలనుకున్నాడు. కానీ సాగులో నష్టం వచ్చిందని పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా గుడికల్లో జరిగింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి