ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ డ్రైవర్లను బెదిరించారు.. నగదు కాజేశారు! - Fake reporters Cheating news

ఇసుక లోడుతో నాలుగు లారీలు వెళ్తున్నాయి...ఇంతలో ఇద్దరు ఆ లారీలను ఆపారు. క్రైమ్ రిపోర్టర్ల​మంటూ నమ్మించారు. పోలీసులు తెలుసని వంచన చేసి...డ్రైవర్లను బెదిరించారు. వారి వద్ద నుంచి 27వేల రూపాయలు నగదు దోచుకుని పరారయ్యారు. చివరకు పోలీసులకు చిక్కారు.

Fake reporters Cheated lorry drivers in Krishna district
నకిలీ రిపోర్టర్స్ పేరుతో మోసం

By

Published : Apr 10, 2021, 10:21 PM IST

నకిలీ రిపోర్టర్స్ పేరుతో మోసం

క్రైమ్ రిపోర్టర్స్​మంటూ లారీ డ్రైవర్లను బెదిరించి 27వేల రూపాయల నగదు కాజేసిన ఘటన కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల వద్ద చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పోలీసుల కథనం ప్రకారం..

ఈ నెల 9న తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో గనిఆత్కూరు ఇసుక రీచ్ నుంచి బిల్లులతో చట్రాయి ఆర్​వీఆర్ ప్రాజెక్టుకు ఇసుకను తరలిస్తున్నారు. పరిటాల సమీపంలో బైపాస్ వద్ద నాలుగు ఇసుక లారీలను ఇద్దరు క్రైమ్ రిపోర్టర్స్​మంటూ ఆపారు. బిల్లులు చూపమన్నారు. అన్నీ సక్రమంగా ఉన్నా.. అధిక లోడుతో వెళ్తున్నారని బెదిరించారు. పోలీసులు తెలుసని చెప్పి.. వారి వద్ద నుంచి రూ.27వేల నగదు వసూలు చేశారు.

వీరిలో ఒకరు గనిఆత్కూరు గ్రామానికి చెందిన యడ్లపల్లి రామనేంద్రబాబు​గా, ఇంకొకరు కొత్తపేట గ్రామానికి చెందిన పులి సువర్ణరాజుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 23 వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, ఒక బైక్​ను స్వాధీనం చేసుకుని...రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:

అదోనిలో సైకో హల్​చల్..ఇద్దరికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details