ప్రభుత్వం ఎన్నిసార్లు హెచ్చరించినా.. ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ చికిత్స పేరిట రోగుల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నాయి. కృష్ణా జిల్లా గుడివాడలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఈవీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రూ.9 లక్షలు బిల్లు చెల్లించమని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించిన వైద్యశాఖ, విజిలెన్స్ అధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేశారు. కైకలూరులోని కొవిడ్ ఆస్పత్రిని ఎమ్మెల్యే నాగేశ్వరరావుతో కలిసి ఎస్పీ రవీంద్రనాథ్ సందర్శించారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
విశాఖ జిల్లా అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ వార్డును ఎంపీ సత్యవతి సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కరోనా సమయంలోనూ విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్గా గుర్తించాలని తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డిమాండ్ చేశారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు.
డబ్యూహెచ్వో సాయం