ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఎక్సైజ్​శాఖ మంత్రి పర్యటన - krishna district

విజయవాడ ముంపు ప్రాంతాల బాధితులను ఎక్సైజ్​శాఖ మంత్రి నారాయణస్వామి పరామర్శించారు. నిరాశ్రయులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు.

exicise minister visted to the vijayawada floodede places in krishna district

By

Published : Aug 23, 2019, 4:28 PM IST

ముంపు ప్రాంతాల్లో బాధితులను పరామర్శిస్తున్న ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి

కృష్ణాజిల్లా విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి పర్యటించారు.రాణిగారితోట,భూపేష్ గుప్తానగర్,బాలాజీనగర్ కాలనీల్లో బాధితులను పరామర్శించారు.కరకట్టపై రిటర్నింగ్ వాల్ నిర్మించి వరదల నుంచి కాపాడాలని స్థానికులు మంత్రిని కోరారు.స్థానిక సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు.నిరుపేదలందరికి ఇళ్లపట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు.అనంతరం చౌకధరల డిపోల్లో నిత్యావసర వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details