ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2020, 8:42 PM IST

ETV Bharat / state

ప్రజావేదిక కూల్చిన రోజే ప్రజాదరణ కోల్పోయారు

తెదేపా నేతల అక్రమ అరెస్ట్​లకు నిరసనగా తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు మాజీ ఎంపీ మాగంటిబాబు తన నివాసంలోనే లాంతరు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు.

మాజీ ఎంపీ మాగంటి బాబు
మాజీ ఎంపీ మాగంటి బాబు

ప్రజావేదిక కూల్చిన రోజే జగన్ ప్రజాదరణ పోగొట్టుకున్నారని మాజీ ఎంపీ మాగంటి బాబు మండిపడ్డారు. జగన్ మరో జన్మెత్తినా పోలవరం పూర్తిచేయలేడన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు మేరకు మాగంటిబాబు ఆయన నివాసంలో లాంతరు వెలిగించి నిరసన తెలిపారు.

అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి, చింతమనేనిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో తెదేపా శ్రేణులు నిరసన తెలిపారు. పార్టీ కార్యాలయం వద్ద కాగడాలతో నిరసన తెలిపి... అచ్చెన్నాయుడును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి

నేతల అరెస్టులపై.. కాగడాలతో తెదేపా శ్రేణుల నిరసన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details