ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'శ్మశాన వాటికలో సమాధులు కూల్చిన అధికారులపై చర్యలేవి?' - చిలకలూరిపేట ఎస్సీ శ్మశాన వాటికలో సమాధుల కూల్చివేత వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో ఇటీవల ఎస్సీ శ్మశాన వాటికలో సమాధులు కూల్చిన ఘటనలో అధికారులపై సరైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని.. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు. తెదేపా ఎస్సీ సెల్ నాయకులతో కలిసి ఆయన శ్మశాన వాటికను పరిశీలించారు.

'శ్మశాన వాటికలో సమాధులు కూల్చిన అధికారులపై చర్యలేవి?'
'శ్మశాన వాటికలో సమాధులు కూల్చిన అధికారులపై చర్యలేవి?'

By

Published : Oct 6, 2020, 3:25 PM IST

చిలకలూరిపేటలో జాతీయ రహదారి పక్కన ఉన్న శ్మశాన ప్రాంగణంలో అభివృద్ధి పనుల పేరిట సమాధులను పురపాలక సంఘం అధికారులు కూల్చేశారని.. ఈ ఘటనతో దళితుల మనస్సులు గాయపడ్డాయని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

తెదేపా ఎస్సీ సెల్ నేతలతో కలిసి ప్రత్తిపాటి.. శ్మశాన ప్రాంగణాన్ని, కూల్చిన సమాధులను పరిశీలించారు. సంఘటన జరిగి 2 వారాలైనా.. అధికారులపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేని ప్రశ్నించారు. దళితుల సమాధులు కూల్చిన ఘటనలో సదరు అధికారికి ప్రమోషన్ ఇవ్వడం.. వైకాపా ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details