ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంటిలేటర్​పై ఆక్సిజన్ అందకే చనిపోతున్నారు: అఖిలప్రియ - మాజీ మంత్రి అఖిల ప్రియ తాజా వార్తలు

కరోనా రోగులకు వెంటిలేటర్​పై ఆక్సిజన్ సరిగా అందకే చనిపోతున్నారని మాజీ మంత్రి అఖిల ప్రియ ఆరోపించారు. కర్నూలు జిల్లాలో నిపుణులు దీనిపై విచారణ జరిపారని.. ఆ నివేదికను కలెక్టర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ex-minister
ex-minister

By

Published : Jul 22, 2020, 8:34 PM IST

వెంటిలేటర్​పై ఉన్న రోగులకు ఆక్సిజన్ సరిగా అందట్లేదని మాజీ మంత్రి అఖిలప్రియ విమర్శించారు. కర్నూలులో కరోనా రోగులకు ఏర్పాటు చేసిన ఆక్సిజన్​పై వాస్తవాలు తొక్కి పెడుతున్నారని ఆరోపించారు. వెంటిలేటర్ పై ఉన్న రోగులకు ఆక్సిజన్ అందకే చనిపోయారన్న ఆరోపణలపై.. నిపుణులు విచారణ జరిపారని అన్నారు. బయోమెడికల్ ఇంజనీర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికను.. కలెక్టర్ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు.

ABOUT THE AUTHOR

...view details