ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 16, 2021, 9:50 PM IST

ETV Bharat / state

చల్లపల్లిలో నిరుపేదలకు ఐవీఎం సంస్థ సాయం

కృష్ణా జిల్లా చల్లపల్లిలో 70 నిరుపేద కుటుంబాలకు ఐవీఎం సంస్థ నిత్యావసర సరకులను అందజేసింది. ప్రతినెలా వారికి ఇలాగే అందిస్తామని తెలిపింది.

challapalli
చల్లపల్లిలో నిరుపేదలకు నిత్యవసరసరకులు పంపిణీ

కృష్ణా జిల్లా చల్లపల్లిలో కర్ఫ్యూ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు ఐవీఎం సంస్థ సాయం చేసింది. 70 నిరుపేద కుటుంబాలకు 80 వేల వ్యయంతో పురిటిగడ్డ స్వచ్ఛంద సేవా సంస్థ, ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరకులు అందజేశారు. వీరికి ప్రతి నెల ఇలాగే అందిస్తున్నామని తెలిపారు. కరోనా ఫస్ట్ వేవ్​లో సైతం ఈ కుటుంబాలకు సంస్థ తరపున బియ్యం, సరకులు అందించామని సంస్థల ప్రతినిధులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details