దేవాదాయశాఖలో గతంలో లేనట్టుగా సంస్కరణలు చేపట్టినట్లు ఆ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుమల, అన్నవరం, కనకదుర్గ తదితర ఆలయాలను ఆన్లైన్ సేవల ద్వారా భక్తులకు దగ్గర చేసినట్లు తెలిపారు. విజయవాడలోని దేవాదాయశాఖ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతీ దేవాలయంలోనూ గోశాలను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
మర్చిపోతున్న సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేసేలా.. "ధర్మపథం" పేరిట కార్యక్రమాలు త్వరలోనే అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రసాద్ స్కీం ద్వారా.. శ్రీశైలం లాంటి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ఆలయాలను పునరుద్ధరణ చేస్తున్నామని మంత్రి తెలిపారు.