తూర్పుగోదావరి జిల్లా నాగాయలంక పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ సందర్శించారు. విద్యార్థులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దిశ చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ నెల 7న ముఖ్యమంత్రి చేతుల మీదుగా మొదటి దిశ పోలీస్ స్టేషన్ను రాజమహేంద్రవరంలో ప్రారంభించనున్నట్లు డీఐజీ వెల్లడించారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, రికార్డులను ఆయన పరిశీలించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్ సిస్టం పనితీరును డీఐజీ సమీక్షించారు.
రాజమహేంద్రవరంలో మొదటి దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు - ఏలూరు రేంజ్ డిఐజి ఏఎస్ ఖాన్ వ్యాఖ్యలు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 7న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మొట్ట మొదటి దిశ పోలీస్ స్టేషన్ని ప్రారంభిస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు. నాగాయలంక పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఆయన.. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల రికార్డులను పరిశీలించారు.
నాగాయలంక పోలీస్ స్టేషన్ను విజిట్ చేసిన ఏలూరు రేంజ్ డిఐజి