ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 18, 2023, 6:06 PM IST

Updated : Jan 18, 2023, 10:11 PM IST

ETV Bharat / state

ఖమ్మం భారాస సభకు ఏపీఎస్ఆర్టీసీ సహకారం.. ఎన్టీఆర్ జిల్లా ప్రయాణికులకు తిప్పలు

విజయవాడ నగరంలో సిటీ బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కేంద్రంలో భారతీయ రాష్ట్ర సమితి బహిరంగ సభకు ఇక్కడి బస్సులను తరలించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కాగా, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు అన్నివిధాలుగా సహకారం అందిస్తున్నారని స్ఠానిక తెదేపా నేతలు విమర్శించారు. జగన్ గుంటనక్క వేషాలను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి జవహర్ పేర్కొన్నారు.

ఖమ్మం భారాస సభకు ఏపీఎస్ఆర్టీసీ
ఖమ్మం భారాస సభకు ఏపీఎస్ఆర్టీసీ

విజయవాడలో సిటీ బస్సుల కొరతతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని వివిధ డిపోలకు చెందిన బస్సులు భారాస సభకు తరలింపుపై విమర్శలు వెల్లువెత్తాయి. గవర్నరు పేట, విద్యాధరపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, తిరువూరు డిపోల బస్సులు భారాసా జెండాలతో ఖమ్మం బాట పట్టాయి.

కేసీఆర్‌, జగన్ వేరు కాదు.. బీఆర్‌ఎస్‌ సభకు రాష్ట్రంనుంచి పెద్ద ఎత్తున బస్సులు పంపుతున్నారని మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. రాష్ట్రం నుండి బస్సులను కేటాయించటంలో అర్థం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్ పెద్దన్నకు, పెద్దన్న.. జగన్ కు పరస్పర సహకారం కొత్తేమీ కాదన్న ఆయన... 2019 ఎన్నికల్లో జగన్‌కు సహకరించినందుకు రిటర్న్ గిప్ట్ ఇస్తున్నారన్నారు. జగన్ గుంట నక్క వేషాలు ప్రజలు గమనిస్తున్నారని జవహర్‌ అన్నారు.

భారాస సభకు ఆర్టీసీ బస్సులు

ఇవీ చదవండి :

Last Updated : Jan 18, 2023, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details