ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వలస కూలీలకు.. 'అమృత' హస్తం!

By

Published : Apr 30, 2020, 2:43 PM IST

విజయవాడలో చిక్కుకున్న వలస కార్మికులకు.. అమృత క్యాటరింగ్ నిర్వాహకులు అన్నదానం చేస్తున్నారు. నిత్యం 500 మందికి ఆహారాన్ని అందిస్తున్నారు.

due to corona lockdown food distribution for  migrant workers at vijayawada in krishna
due to corona lockdown food distribution for migrant workers at vijayawada in krishna

ఉపాధి కోసం వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడ నగరానికి వచ్చిన ఎంతో మంది వలస కార్మికులు... లాక్​డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆటోనగర్ ప్రాంతంలో ఉపాధి కోసం వచ్చి.. పనుల్లేక ఆకలితో అలమటిస్తున్న వందలాది మంది కార్మికులకు... అమృత క్యాటరింగ్ సంస్థ నిత్యం అన్నవితరణ చేస్తోంది.

యోగా, వాకింగ్ సంఘాలతో కలిసి.. దాతలు అందించిన నగదుతో నిత్యం 500 మందికి పైగా వలస కార్మికులకు ఆహారం అందిస్తోంది. భోజనం, మంచినీళ్లు, అరటిపండ్లు, గుడ్డు లాంటి పౌష్టికాహారం అందిస్తూ.. కార్మికుల కడుపు నింపుతోంది. మే 3 తర్వాత లాక్​డౌన్ కొనసాగించినా.. కార్మికులకు నిత్యం ఆహార పంపిణీ చేస్తామన్నారు.. దాతలు.

ఇదీ చదవండి:అక్కడ వాట్సాప్​ వీడియోలో మంత్రాలు.. ఇక్కడ కర్మకాండలు

ABOUT THE AUTHOR

...view details