కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్న మత్స్యశాఖ అధికారులు తగిన సూచలిస్తే నష్టాలు తగ్గించుకోవచ్చిన ఆక్వారైతులు అంటున్నారు. మత్స్యశాఖ అధికారులు ఆక్వా రైతులను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డలో ఆక్వాకల్చర్ కోసం ప్రత్యేక ల్యాబ్ నిర్మాణం చేపట్టాలని శిలాఫలకం వేశారు... కానీ ల్యాబ్ నిర్మాణానికి ఇంత వరకు ప్రారంభంకాలేదన్నారు. ప్రభుత్వ ల్యాబ్ అందుబాటులో లేక.. నీటి పరీక్షలు కోసం ప్రైవేట్ ల్యాబ్లలో వేలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటున్నారు. వనామి రొయ్యలకు వచ్చే వ్యాధులు, వైరస్లపై మత్స్యశాఖ అధికారులు ఇప్పటికైనా స్పంచింది రైతులకు అవగాహన కల్పించాలని ఆక్వారైతులు కోరుతున్నారు.
ఆక్వారైతుల ఆవేదన... సాగుసాయం కోసం వేడుకోలు - diviseema Aqua farmers news
ఒకప్పుడు చౌడు భూముల్లో డాలర్లు పండించిన దివిసీమ ఆక్వా రైతులు.. ఇప్పుడు అప్పులు బారిన పడుతున్నారు. కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిన ఆక్వా రైతులు... కనీసం పెట్టిన పెట్టుబడి తిరిగి రాక ఎవరికి చెప్పుకోవాలో పాలుపోయిస్థితిలో ఉన్నారు. వాతావరణమార్పులతో రొయ్యల సాగులో వస్తున్న వ్యాధులతో నష్టాల ఊబిలో చిక్కుకుంటున్నారు. సాగులో వచ్చే వ్యాధులను నివారించేందుకు మత్స్యశాఖ అధికారులు తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.
ఆక్వారైతుల ఆవేదన... సాగుసాయం చేయాలని వేడుకోలు
Last Updated : Oct 16, 2019, 12:03 AM IST