కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది తమ విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎండలనుసైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తిస్తున్న వీరికి పలువురు ఆహారం, మజ్జిగ అందిస్తున్నారు. విజయవాడ నగరానికి చెందిన భాజపా నేత పాతూరి నాగభూషణం పండ్లు పంపిణీ చేశారు. నగరంలోని బెంజిసర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు 2 టన్నుల పుచ్చకాయలు, కర్బూజ పండ్లను అందించారు. ప్రజలందరూ లాక్డౌన్ను తప్పనిసరిగా పాటించి, ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమవ్వాలని సూచించారు.
విజయవాడలో పోలీసులకు పండ్ల పంపిణీ
కరోనా వ్యాప్తి నివారణలో అత్యవసర సేవలందిస్తున్న పోలీసులకు పలువురు సహాయం చేస్తున్నారు. విజయవాడకు చెందిన భాజపా నేత పోలీసులకు పండ్లు పంపిణీ చేశారు.
విజయవాడలో పోలీసులకు పండ్లు పంపిణీ