ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ నిరసన - నూజివీడు పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ నిరసన

కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆందోళన చేపట్టింది. ఫిర్యాదు చేయడానికి ఠాణాకు వస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫలితంగా రోడ్డుపై బైఠాయించినట్లు బాధిత మహిళ తెలిపింది.

dharna-in-front-of-nuziveedu-police-station-over-attack-on-family
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ నిరసన

By

Published : Feb 8, 2021, 10:47 PM IST

తన ఇంటిపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ... కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆందోళన చేపట్టింది. ఈ దాడిలో తన భర్త, అత్తామామలు తీవ్రంగా గాయపడ్డారని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా... సరిగా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా చేసేదేమీ లేక ఠాణా ఎదుట రోడ్డుపై బైఠాయించినట్లు బాధితురాలు తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details