ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 11, 2021, 5:11 AM IST

ETV Bharat / state

'నన్ను ఇరికించే కుట్ర చేశారు.. సీబీఐతో విచారణ జరిపించాలి'

తనపై విచారణకు ఆదేశిస్తూ డీజీపీ, సీఐడీ అదనపు డీజీపీకి జారీ చేసిన మెమోలో స్వయంగా తేదీని డీజీపీనే మార్చేశారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఈ నేరంలో ఉన్నతాధికారులు భాగస్వాములయ్యారన్నారు. వెంటనే ఈ కేసును సీబీఐతో విచారించేలా ఆదేశించాలని సీఎస్​ను కోరారు.

'నన్ను ఇరికించే కుట్ర చేశారు.. సీబీఐతో విచారణ జరిపించాలి'
'నన్ను ఇరికించే కుట్ర చేశారు.. సీబీఐతో విచారణ జరిపించాలి'

మోసం, ఫోర్జరీ, ఆధారాల ట్యాంపరింగ్‌ ద్వారా నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో.. తనను అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నించిన వారిపై సీబీఐ విచారణ జరిపించాలని సీనియర్‌ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు.

వారంతా ఇందులో భాగస్వాములే..

ఈ నేరంలో డీజీపీ, సీఐడీ అదనపు డీజీ, ఏసీబీ డీజీ, నిఘా విభాగం అధికారులతో పాటు మరికొందరు భాగస్వాములయ్యారన్నారు. ఆయా అధికారులను వారు ప్రస్తుతమున్న స్థానాల్లోనే కొనసాగిస్తే ఈ కేసు స్వేచ్ఛాయుత, సకాల దర్యాప్తునకు విఘాతం కలుగుతుందన్నారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

'అందుకే సీబీఐకి'

డీజీపీ లేఖ ఆధారంగా తనను సస్పెండ్‌ చేస్తూ.. అక్రమ ఉత్తర్వులు జారీ చేసిన ప్రవీణ్‌ ప్రకాశ్, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిలపైనా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.

'ఆయనే స్వయంగా మార్చేశారు'

తనపై విచారణకు ఆదేశిస్తూ డీజీపీ, సీఐడీ అదనపు డీజీపీకి జారీ చేసిన మెమోలో 2020 ఫిబ్రవరి 5గా ఉన్న తేదీని.. 2020 ఫిబ్రవరి 2గా స్వయంగా డీజీపీనే మార్చేశారని.. లేఖలో వివరించారు. దాన్నే కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీస్‌ ముందు.. ఇటీవలే సమర్పించారన్నారు.

'ఫోర్జరీ కిందకి వస్తుంది'

ఐపీసీ సెక్షన్‌ 463 ప్రకారం ఇది ఫోర్జరీ కిందకి వస్తుందని వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : సీఎం జగన్ తిరుపతి ఉప ఎన్నిక ప్రచార సభ రద్దు

ABOUT THE AUTHOR

...view details