ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా నేతలు ప్రకృతి వనరులను దోచుకుంటున్నారు'

వైకాపా నేతలు ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఇసుక దోచుకున్న వారినే ఇసుక కార్పొరేషన్ కమిటీలో సభ్యులుగా నియమించారని విమర్శించారు.

By

Published : Jul 16, 2020, 8:03 PM IST

devineni uma on sand mining scam by ysrcp leaders
ఇసుక అక్రమాలపై దేవినేని ఉమా

'ఇసుక దోచుకున్న మంత్రులను ఇసుక కార్పొరేషన్ కమిటీలో సభ్యులుగా నియమించడం హాస్యాస్పదంగా ఉంది' అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు ప్రకృతి ప్రసాదించిన వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు.

కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలో ఇసుక క్వారీల పనితీరుపై ఆరా తీశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బెంగళూరులో ఇసుక అమ్ముకుంటున్నారని.. పేర్ని నాని రవాణా సదుపాయాలు కల్పిస్తే కొడాలి నాని ఇసుకను రూ. 50,000 కు లారీకి అమ్ముతున్నారని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details