ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యుత్ రంగంపై 2వేలకోట్ల భారం అవసరమా..?

వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ బిగింపు చేయడమంటే.. ఉచిత విద్యుత్​కి మంగళం పాడినట్టేనని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.

By

Published : Sep 6, 2020, 1:25 PM IST

Published : Sep 6, 2020, 1:25 PM IST

ETV Bharat / state

విద్యుత్ రంగంపై 2వేలకోట్ల భారం అవసరమా..?

devineni uma comments on jagan
మాజీ మంత్రి దేవినేని ఉమా

18 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మీటర్ పెట్టి.. విద్యుత్ రంగంపై 2వేలకోట్ల భారం పెంచడం అవసరమా? అని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. రైతులు వ్యతిరేకిస్తున్నా మీటర్ బిగింపు వెనక మతలబేంటని ప్రశ్నించారు. ఉచిత విద్యుత్​కి మంగళం పాడేందుకేనా ఈ మీటర్లని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నగదు బదిలీని వైకాపా వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతులు, నిపుణులు అడుగుతున్న ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలని ఉమా డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details