ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైకాపా ఇసుక దోపిడిపై సీఎం సమాధానం చెప్పాలి: దేవినేని

By

Published : Jun 1, 2020, 2:44 PM IST

రాష్ట్రంలో వైకాపా నేతలు ఇసుక దోపిడికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఇసుక కొరత సృష్టించి సామాన్యులకు దొరక్కుండా చేశారని మండిపడ్డారు.

devineni uma
devineni uma

దేవినేని ఉమా ట్వీట్

ఉచిత ఇసుకను రద్దుచేసి.. కొరత సృష్టించి.. వైకాపా ప్రభుత్వం దోపిడీకి తెర తీసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఏడాది వైకాపా పాలనలో మంత్రులు శాసనసభ్యులు, నాయకులు లక్షలాది టన్నుల ఇసుకను గుట్టలుగా పోసి దోపిడీ చేశారన్నారు.

సామాన్యుడికి మాత్రం ఇసుక దొరకడం లేదని ఆవేదన చెందారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details