ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనాతో చనిపోయిన గుమస్తాల కుటుంబాలకు రూ. 10లక్షలు ఎక్స్​గ్రేషియా ఇవ్వాలి' - కరోనా మరణాలపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు వ్యాఖ్యలు

కరోనాతో చనిపోయిన కార్మికులు, వారి కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు మండిపడ్డారు. విజయవాడలో వివిధ రకాల షాపుల్లో పని చేస్తున్న 12 మంది గుమస్తాలు.. కరోనాతో చనిపోయారని వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

CPM state secretary class member Baburao
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు

By

Published : May 31, 2021, 11:23 AM IST

విజయవాడలో వివిధ రకాల షాపుల్లో పని చేస్తున్న 12 మంది గుమస్తాలు.. కరోనా కారణంగా చనిపోయారని.. వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్​గ్రేషియా చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా రావాల్సిన ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్ సొమ్ముతోపాటు అధికంగా ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు.

కరోనాతో చనిపోయిన కార్మిక కుటుంబాల పిల్లలను ఆదుకోవాలన్నారు. కొవిడ్​కు గురైన వారు 15 నుంచి 20 రోజులు విధులకు రాలేని పరిస్థితి ఉందని.. అందువలన ప్రభుత్వం పూర్తి జీతం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరోనాతో చనిపోయినవారి కుటుంబాలకు యాజమాన్యం సైతం అండగా నిలవాలని సూచించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details