ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 30, 2020, 9:33 AM IST

ETV Bharat / state

'గ్యాస్ లీక్ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి'

విశాఖ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ ఘటనపై సీపీఐ నేత రామకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

cpi ramarishna
cpi ramarishna

విశాఖ సాయినార్‌ కంపెనీలో గ్యాస్ లీకేజీ ఘటన బాధాకరమని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాద మృతులకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని రామకృష్ణ డిమాండ్​ చేశారు. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలున్న పరిశ్రమలన్నింటినీ అధికారులు తనిఖీ చేయాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details