నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ఎస్ఈసీగా పునర్నియమించాలని గవర్నర్ ఆదేశాలు ఇవ్వడంపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నర్ ఆదేశాలు జారీ చేశారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా సీఎం విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు. ఈ ఆదేశాలు పాటించకపోతే రాజ్యాంగ సంక్షోభం తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఎంతటి వారికైనా పట్టువిడుపులు ఉండాలని వ్యాఖ్యానించారు.
'ఈ ఆదేశాలు పాటించకపోతే రాజ్యాంగ సంక్షోభం తప్పదు'
నిమ్మగడ్డ విషయంలో జగన్ సర్కారుకు అన్ని దారులు మూసుకుపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
Last Updated : Jul 22, 2020, 1:06 PM IST