ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ఈ ఆదేశాలు పాటించకపోతే రాజ్యాంగ సంక్షోభం తప్పదు'

By

Published : Jul 22, 2020, 12:48 PM IST

Updated : Jul 22, 2020, 1:06 PM IST

నిమ్మగడ్డ విషయంలో జగన్‌ సర్కారుకు అన్ని దారులు మూసుకుపోయాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సీఎం విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు.

cpi narayana comments on jagan
సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ

జగన్​పై సీపీఐ నారాయణ విమర్శలు

నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్​ను ఎస్​ఈసీగా పునర్నియమించాలని గవర్నర్‌ ఆదేశాలు ఇవ్వడంపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు, గవర్నర్‌ ఆదేశాలు జారీ చేశారని ఆయన గుర్తుచేశారు. ఇప్పటికైనా సీఎం విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు. ఈ ఆదేశాలు పాటించకపోతే రాజ్యాంగ సంక్షోభం తప్పదని హెచ్చరించారు. రాజకీయాల్లో ఎంతటి వారికైనా పట్టువిడుపులు ఉండాలని వ్యాఖ్యానించారు.

Last Updated : Jul 22, 2020, 1:06 PM IST

ABOUT THE AUTHOR

...view details