ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఓ ఆవు అమ్మతనం... ఏం చేసిందో చూడండి...

By

Published : Nov 14, 2019, 11:57 PM IST

పదిహేను రోజుల క్రితం అదే ప్రాంతంలో చనిపోయిన లేగదూడను... ఓ వ్యక్తి రిక్షాలో వేసుకొని తీసుకెళ్లాడు. గురువారం ఆ వ్యక్తి తారసపడ్డాడు. దూడను కోల్పోయిన ఆవు అతన్ని గుర్తుపట్టి దాడి చేసింది. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్​ వద్ద జరిగింది.

మచిలీపట్నం బస్టాండ్​ వద్ద ఆవు హల్​చల్​

మచిలీపట్నం బస్టాండ్​ వద్ద ఆవు హల్​చల్​

కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్టాండ్ వద్ద ఆవు హల్ చల్ చేసింది. 15 రోజుల క్రితం అదే ప్రాంతంలో తన దూడ ప్రమాదంలో చనిపోయింది. ఆ లేగదూడను రిక్షాలో తీసుకెళ్లిన వ్యక్తి... ఇవాళ అటుగా వెళ్లటం గుర్తించిన ఆవు... అతనిపై దాడి చేసింది. రిక్షాను తలకిందులుగా చేసింది. ఆవు దాడి నుంచి స్థానికులు బాధితున్ని రక్షించారు. తన బిడ్డను తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తుపెట్టుకుని దాడి చేయడంపై... స్థానికులు విస్తుపోయారు.

ABOUT THE AUTHOR

...view details