ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విషం తాగిన దంపతులు: భార్య మృతి, భర్త పరిస్థితి విషమం..

ఓ దంపతులకు అనారోగ్యం, ఆర్థిక సమస్యలు అధికమయ్యాయి. తీవ్ర మనోవేదనకు గురైన భర్త.. భార్యకు విషం ఇచ్చి తాను కూడా తీసుకున్నాడు. భార్య మరణించగా.. భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్​లోని రహమత్ నగర్​లో జరిగింది.

By

Published : Mar 12, 2021, 8:23 PM IST

విషం తాగిన దంపతులు: భార్య మృతి, భర్తి సీరియస్
విషం తాగిన దంపతులు: భార్య మృతి, భర్తి సీరియస్

అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా మారింది. హైదరాబాద్​లోని రహమత్ నగర్​లో నివసించే సుబ్బారావు, సాయి లక్ష్మి భార్యా - భర్తలు. సాయి లక్ష్మి కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఇటీవలే బ్రెయిన్ సర్జరీ చేయించారు. ఇటూ అనారోగ్య సమస్యలు, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. తట్టుకోలేని భర్త తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకున్నాడు.

అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను పంజాగుట్టలోని స్వరాజ్ రిహాబిలిటేషన్ సెంటర్​లో చేర్చాడు. పరిస్థితి మరింత విషమించి భార్యకు గుర్తుతెలియని విషం ఇచ్చి తాను కూడా సేవించాడు. ఆమె మృతి చెందగా.. భర్త సుబ్బారావు అపస్మారక స్థితిలోకి చేరాడు.

ఆ కేంద్రం నిర్వాహకులు ఇచ్చిన సమాచారం మేరకు వారి కుమార్తె ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి మృతి చెందినట్లు గుర్తించారు. అపస్మారకస్థితిలో ఉన్న తండ్రిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారున్న గదిలో సూసైడ్ లెటర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి :పింగళి వెంకయ్య కుమార్తెకు సీఎం జగన్ సన్మానం

ABOUT THE AUTHOR

...view details