కృష్ణా జిల్లా నూజివీడు మునిసిపాలిటీ ఐదో వార్డు కౌన్సిలర్ పగడాల సత్యనారాయణ... కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంపై చలించారు. అన్నీ తానై.. మృతదేహాలకు అంతిమ సంస్కారం చేయించారు. అయినవారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబసభ్యులే ముందుకు రాని పరిస్థితుల్లో ఈ కార్యక్రమం చేపట్టిన కౌన్సిలర్ సత్యనారాయణను పలువురు అభినందించారు.
అయిన వారు కాదన్నారు... కౌన్సిలరే ఆఖరి క్రతువు నిర్వహించారు! - corona deaths in krishna district
కరోనాతో మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు సొంత కుటుంబీకులే సంశయిస్తున్న ప్రస్తుత పరిస్థితిల్లో... కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన ఓ కౌన్సిలర్ మానవత్వాన్ని చాటుకున్నారు. కొవిడ్తో చనిపోయిన వారికి అంతిమసంస్కారాలు నిర్వహించి పలువురి అభినందనలు అందుకుంటున్నారు.
![అయిన వారు కాదన్నారు... కౌన్సిలరే ఆఖరి క్రతువు నిర్వహించారు! councilor doing cremation of covid victims in nuziveedu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11734915-203-11734915-1620832420678.jpg)
నూజివీడులో కరోనా మృతదేహాల అంత్యక్రియలు