ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో జోరుగా ఎన్నికల ప్రచారం

విజయవాడలో నగరపాలక సంస్థ ఎనిమిదో డివిజన్​లో తూర్పు నియోజకవర్గ ఇన్​ఛార్జ్ దేవినేని అవినాష్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైకాపా కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే రోడ్లు, డ్రైనేజి వంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తామని హామీఇచ్చారు.

By

Published : Feb 28, 2021, 8:08 PM IST

corporation election campaigning in vijayawada
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్​ఛార్జ్ దేవినేని అవినాష్‌

విజయవాడలో నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఎనిమిదో డివిజన్​లో వైకాపా అభ్యర్థి తరఫున విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్​ఛార్జ్ అవినాష్ ప్రచారం చేపట్టారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

కరోనా లాక్​డౌన్ సమయం నుంచి ప్రజల మధ్య ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తున్నానని ఎనిమిదో డివిజన్ అభ్యర్థి రజినీ పేర్కొన్నారు చేశారు. సమస్యల పరిష్కారంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని 28వ డివిజన్ భాజపా అభ్యర్థి శివనాగేశ్వరరావు పేర్కొన్నారు. భాజపాతో పాటు జనసేన అభ్యర్థులను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.

సీపీఎంతోనే అభివృద్ధి సాధ్యం

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో 22వ డివిజన్ సీపీఎం అభ్యర్థి చిన్నారావు విజయాన్ని కాంక్షిస్తూ... సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. మధు ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి చేసే వ్యక్తులకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. భాస్కర్​రావుపేటను అభివృధి పథంలో నడిపించడం సీపీఎం వల్లే సాధ్యమవుతుందని మధు స్పష్టం చేశారు.

ఇదీచదవండి.

ఓటరు జాబితా ప్రకారం.. యువకులకు క్రికెట్ కిట్ల పంపిణీ!

ABOUT THE AUTHOR

...view details