ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో యథేచ్చగా కరోనా నిబంధనలు ఉల్లంఘన - విజయవాడలో కరోనా నిబంధనలు ఉల్లంఘన

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదని ప్రజలు తప్పని సరిగా కరోనా నిబంధనలు పాటించాలని ప్రభుత్వం పదే పదే ప్రచారం చేస్తుంది. తప్పక జాగ్రత్తలు పాటించాలని ఆదేశాల్లో తెలిపింది. కాని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కరోనా నిబందనలను నిర్వాహకులు పూర్తిగా విస్మరించారు.

విజయవాడలో యథేచ్చగా కరోనా నిబంధనలు ఉల్లంఘన
విజయవాడలో యథేచ్చగా కరోనా నిబంధనలు ఉల్లంఘన

By

Published : Nov 2, 2020, 3:47 PM IST

Updated : Nov 2, 2020, 7:00 PM IST

విజయవాడలోని తుమ్మల పల్లి కళాక్షేత్రంలో సాక్ష్యాత్తు మంత్రులు పాల్గొన్న సభలో కొవిడ్ నిబంధనలు యథేచ్చగా బేఖాతరయ్యాయి. బీసీ కార్పోరేషన్ ఛైర్మన్లు, డైరక్టర్లగా నియమితులైన వారి సన్మాన కార్యక్రమం తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరిగింది. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, కొడాలి నాని, ఎంపీ మోపిదేవి వెంకటరమణ సహా కృష్ణాజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, వైకాపా నేతలంతా పాల్గొన్నారు. ముఖ్యులు పాల్గొన్న ఈ సభలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా నిర్వహకులు నిర్లక్ష్యం వహించారు.

లాక్​డౌన్ అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతివ్వలేదు. ఆ సమయంలో ఇక్కడ వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించేవారు. 7 నెలల తర్వాతా ఆడిటోరియంలో సభకు అనుమతించగా భారీ సంఖ్యలో ప్రజలను లోపలికి అనుమతించారు. నిబంధనల ప్రకారం ఆడిటోరియంలో భౌతికదూరం పాటిస్తూ సీట్లూ కేటాయించాల్సి ఉన్నా ఎక్కడా కనిపించలేదు. చాలా మంది మాస్కులు ధరించనప్పటికి లోపలికి అనుమతించారు. ఆడిటోరియంలో బయటకు గాలి వెలుతురు ప్రసరించేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎక్కడా కనిపించలేదు.

కోవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న పరిస్ధితుల్లో ఈ తరహా కార్యక్రమాలను చేపట్టడం, నిబంధనలు పాటించకపోవడంపై సభకు హాజరైన పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమాత్యులు హాజరైన సభలో ఇలా చేస్తే ఎలా అని నిర్వహకులను కొందరు ప్రశ్నించారు.

ఇదీ చదవండి

నాన్‌ బెయిలబుల్‌ కేసులు దుర్మార్గం: అమరావతి జేఏసీ

Last Updated : Nov 2, 2020, 7:00 PM IST

ABOUT THE AUTHOR

...view details