ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1395 కరోనా కేసులు... 9 మంది మృతి - covid cases in ap

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1395 కరోనా కేసులు నమోదయ్యాయి. 9 మంది మహమ్మారి బారిన పడి చనిపోయారు. చిత్తూరు, కృష్ణా, విశాఖ జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందగా.. కడప, అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరు చొప్పున మరణించారు.

ఏపీలో కరోనా కేసులు
ఏపీలో కరోనా కేసులు

By

Published : Nov 17, 2020, 6:49 PM IST

రాష్ట్రంలో కొత్తగా 66 వేల 778 కరోనా పరీక్షలు చేయగా... 1395 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8 లక్షల 56 వేల 159కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజులోనే 9 మంది మరణించగా... మొత్తం మరణాల సంఖ్య 6 వేల 890కి పెరిగింది. కొత్తగా 2 వేల 293 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 16 వేల 985 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details