కరోనా ఉద్ధృతి పెరిగాక.... రాష్ట్రంలోతొలిసారి వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కేవలం 753 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం 13 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 8 లక్షల 54 వేల 764కు పెరిగింది. అలాగే.... కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6వేల 881కి చేరింది. గడచిన 24 గంటల వ్యవధిలో 43 వేల 44 నమూనాలకు పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 15 వందల 7 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.29 లక్షలకు చేరింది. ప్రస్తుతం 17 వేల 892 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం 91.97 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
జిల్లాలో కరోనా కేసులు