ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో తొలిసారి వెయ్యిలోపే కరోనా కేసులు - కరోనా అప్డేడ్స్ వార్తలు

రాష్ట్రంలో తొలిసారి వెయ్యిలోపే కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 753 మంది వైరస్ బారినపడ్డారు. 13 మంది మహమ్మారితో మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

రాష్ట్రంలో తొలిసారి వెయ్యిలోపు కరోనా కేసులు నమోదు
రాష్ట్రంలో తొలిసారి వెయ్యిలోపు కరోనా కేసులు నమోదు

By

Published : Nov 16, 2020, 5:35 PM IST

Updated : Nov 16, 2020, 7:16 PM IST

కరోనా ఉద్ధృతి పెరిగాక.... రాష్ట్రంలోతొలిసారి వెయ్యిలోపు కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో కేవలం 753 మందికి కరోనా నిర్ధరణ అయినట్లు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. కేవలం 13 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం వైరస్‌ బాధితుల సంఖ్య 8 లక్షల 54 వేల 764కు పెరిగింది. అలాగే.... కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6వేల 881కి చేరింది. గడచిన 24 గంటల వ్యవధిలో 43 వేల 44 నమూనాలకు పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 15 వందల 7 మంది బాధితులు వ్యాధి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.29 లక్షలకు చేరింది. ప్రస్తుతం 17 వేల 892 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రంలో మొత్తం 91.97 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.

జిల్లాలో కరోనా కేసులు

ఇవాళ నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 10, గుంటూరు జిల్లాలో 9, కడప జిల్లాలో 6, పశ్చిమగోదావరి జిల్లా 4, కృష్ణా 3, అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఇప్పటి వరకూ184 కేసులు నమోదు కావడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

ఇవీ చదవండి

మచిలీపట్నం ఆసుపత్రిని పరిశీలించిన ఎంపీ బాలశౌరి

Last Updated : Nov 16, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details