ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలుష్య ప్రాంతాలుగా రాణిగారితోట, కృష్ణలంక - complete lock down at vijayawada ranigarithota news

విజయవాడలోని కృష్ణలంకలో కొవిడ్-19 పాజిటివ్ కేసు నమోదు కావటంతో... ఆ ప్రాంతంలో నేడు పూర్తి లాక్​డౌన్ పాటించాలని జిల్లా పాలనాధికారి ఇంతియాజ్ సూచించారు. 16, 17, 18, 20, 21, 21 డివిజన్లలో పూర్తిగా లాక్​డౌన్​ను ఒక రోజు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రజలెవ్వరు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రావల్సి వస్తే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని, మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలన్నారు.

complete lock down at krishnalanka due to corona affect
రాణిగారితోట, కృష్ణలంకలో లాక్​డౌన్

By

Published : Mar 30, 2020, 12:38 PM IST

కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసిన రాణిగారితోట, కృష్ణలంక ప్రాంతాన్ని అధికారులు కాలుష్యప్రాంతంగా ప్రకటించారు. 16, 17, 18, 20, 21, 21 డివిజన్లలో పూర్తిగా లాక్​డౌన్ ప్రకటించారు. ప్రజలెవ్వరూ బయటికి రావద్దని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. పలు చోట్ల చెక్​పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కిలోమీటరు పరిధిలోగల భౌగోళిక ప్రాంతాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు. ఈ డివిజన్లలో 3 కలోమీటర్ల పరిధిలో రాకపోకలపై ఆంక్షలు విధించారు. అనుమానితులను వెంటనే ఆసుపత్రుల్లోని ఐసోలేషన్ వార్డులకు తరలించేలా ఏర్పాటు చేస్తున్నారు.

రాణిగారితోటలోకి ప్రవేశించే మార్గాలైన రామలింగేశ్వరనగర్, గీతానగర్, మహితా పబ్లిక్ స్కూలు, నేతాజీ వంతెన, సబ్​వే పరిసరాల్లోని వాటర్ ట్యాంక్, తారకరామనగర్ కరకట్ట పరిధిలోని రాజు వాటర్ ప్లాంట్, ఫకీర్​గూడెం శ్మశానవాటిక తదితర ప్రాంతాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం పారిశుద్ధ్య సిబ్బంది ప్రతీ వీధిలో బ్లీచింగ్ చల్లారు. అగ్నిమాపక వాహనం సాయంతో హైపోక్లోరెడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ప్రజలెవ్వరు వీధుల్లోకి రావద్దంటూ మైకుల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

పానీ పూరీలు తయారు చేస్తూ...

పాజిటివ్ కేసు నమోదైన వ్యక్తి రాణిగారితోటలో పానీపూరీ తయారీ చేపట్టి అదే ప్రాంతంలో పలు బండ్లకు వాటిని సరఫరా చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన పలువురు ఆయన వద్ద పనిచేస్తుంటారు. బాధితుడు గత జనవరిలో కుటుంబసభ్యులతో మక్కా వెళ్లి ఈ నెల 10న తిరిగి వచ్చాడు. అనంతరం ఆయన ఇంటి వద్ద దైనందిన క్రమంలో పానీపూరీలకు తయారు చేయటం... పనివారు అక్కడకు వెళ్లి పనిచేస్తుండటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటి వరకు అతను పరిసర ప్రాంతాల్లో సంచరించటంతో పాటు వేడుకలకు కూడా హాజరైనట్లు చెబుతున్నారు. దీంతో పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. వైద్యులు స్పందించాలని ఈ ప్రాంత వాసులు విన్నవిస్తున్నారు.

ఇదీ చదవండి:

తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?

ABOUT THE AUTHOR

...view details