ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'డీఆర్​డీవో సిబ్బంది క్వార్టర్స్​కు భూములను పరిశీలించిన కలెక్టర్​' - collector imtiaz

కృష్ణా జిల్లా గుల్లలమోదలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ను ఏర్పాటు చేయనున్నారు. సంస్థ సిబ్బంది క్వార్టర్స్​​​ నిర్మాణం కోసం అధికారులు భూములను పరిశీలించారు. అనంతరం అవనిగడ్డ మండలం రేగు లంక గ్రామంలో పరిశీలించిన భూముల చుట్టూ ఎర్రజెండాలు పాతించారు.

డీఆర్​డీవో సిబ్బంది క్వార్టర్స్ కు భూములను పరిశీలించిన కలెక్టర్

By

Published : Sep 23, 2019, 12:06 AM IST

డీఆర్​డీవో సిబ్బంది క్వార్టర్స్ కు భూములను పరిశీలించిన కలెక్టర్

కృష్ణాజిల్లాలో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సిబ్బందికి క్వార్టర్స్​ నిర్మించనున్నారు. కలెక్టర్​ ఇంతియాజ్​ మచిలీపట్నం ఆర్​డీవో ఉదయ భాస్కర్ తో కలిసి క్వార్టర్స్​ కు సంబందించిన స్థలాల మ్యాప్ లను పరిశీలించారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ శివారు రేగు లంక గ్రామంలో సర్వే నెంబరు 54, 55, 56 లో ఉన్న 46.66 సెంట్ల సోసైటీ భూముల్లో ఎర్రజెండాలను పాతించారు. అనంతరం అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో ఏర్పాటు కానున్న గ్రామ సచివాలయ భవనాలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో ఈ నెల 24, 25 తేదీల్లో ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details