ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు ప్రారంభంకానున్న సీపెట్‌ నూతన భవనం - cipet campus inauguration by cm jagan

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ శాశ్వత భవనం ప్రారంభానికి సిద్ధమైంది. ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌లో పరిశోధన, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కోసం సీపెట్‌ కృషి చేస్తుంది. ప్లాస్టిక్ పరిశ్రమలకు సాంకేతిక సహకారం అందించేందుకు నూతన భవనాల్లో సిద్ధమైన సీపెట్‌పై ప్రత్యేక కథనం.

నేడు ప్రారంభంకానున్న సీపెట్‌ నూతన భవనం

By

Published : Oct 23, 2019, 7:45 PM IST

Updated : Oct 28, 2019, 8:25 AM IST

సీపెట్‌ శాశ్వత భవనాలను కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానంద్ గౌడతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ నేడు ప్రారంభించనున్నారు. 2016 నుంచి విజయవాడ న్యూ ఆటోనగర్‌లోని తాత్కాలిక భవనాల్లో సేవలందించిన సీపెట్‌... నేటి నుంచి గన్నవరం మండలం సూరంపల్లి శాశ్వత భవనాల్లో సేవలందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులతో భవనం నిర్మాణం చేపట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న సీపెట్‌ సంస్థల నిర్మాణాలలో విజయవాడ సంస్థ అగ్రగామిగా నిలుస్తుందని డైరక్టర్‌ వి . కిరణ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ పరీక్ష ద్వారా సీట్లు భర్తీ చేస్తామన్నారు.

శాశ్వత భవనం నిర్మాణ దశలో ఉన్నప్పుడే విజయవాడలో సీపెట్‌ కార్యకలాపాలు ప్రారంభించింది. డిప్లొమా కోర్సులతోపాటు ప్లాస్టిక్ ఇంజనీరింగ్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి సాంకేతికంగా సహకారం అందిస్తుంది. తాత్కాలిక భవనాల్లో ఏడాదికి సుమారు 1500 మందికి శిక్షణ ఇచ్చామని...శాశ్వత భవనాల్లో 5000 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యమని సంస్థ డైరెక్టర్‌ తెలిపారు.

పారిశ్రామికంగా ఏ రంగం చూసినా ప్లాస్టిక్‌తోనే ముడిపడి ఉంది. అందువల్ల నానాటికీ ప్లాస్టిక్ రంగం అభివృద్ధి చెందుతోంది. ప్లాస్టిక్ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికే కాకుండా ఉపాధి కల్పించడంలోనూ కీలక భూమిక పోషించనుంది.

ప్రారంభానికి సిద్ధమైన సీపెట్‌ నూతన భవనం

ఇవి కూడా చదవండి:

వందేళ్లు దాటిన దంపతులకు జోర్దార్​గా బర్త్​డే పార్టీ

Last Updated : Oct 28, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details