ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తోన్న విస్తారా ఎయిర్​లైన్స్ విమానంలో సాంకేతికలోపం తలెత్తి టేకాఫ్ అయిన అరగంటకే.. విమానాన్ని వెనక్కు తిప్పి ముంబయిలో దింపారు. విమానంలో సినీనటుడు చిరంజీవితోపాటు... 120 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు.

By

Published : Aug 31, 2019, 12:52 AM IST

Updated : Aug 31, 2019, 9:01 AM IST

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

మెగాస్టార్ చిరంజీవి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న విస్తారా ఎయిర్​లైన్స్ విమానం సాంకేతిక లోపం తలెత్తడం వల్ల పైలెట్ అప్రమత్తమయ్యారు. టేకాఫ్ అయిన అరగంటకే మళ్లీ విమానాన్ని వెనక్కు తిప్పి ముంబయి ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 120 మంది ప్రయాణికులున్నారు. పైలట్ వెంటనే సమస్యను గుర్తించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికులంతా విమానాశ్రాయంలోనే పడిగాపులు కాయగా.. తర్వాత మరో విమానం ఏర్పాటు చేసి వారిని హైదరాబాద్ పంపారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు చిరంజీవి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్​ చేయడం వల్ల ఈ విషయం బయటకు వచ్చింది.

చిరంజీవి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
Last Updated : Aug 31, 2019, 9:01 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details